జగన్..పీకేపై పర్సనల్ అటాక్ పొలిటికల్ కరోనా వైరస్..


చైనా నుంచి ఎలా వచ్చిందో ఏమో కానీ..ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే విషయం గురించి భయపడుతోంది..ఆలోచిస్తోంది. తమ దాకా రాకూడదంటూ  ప్రయత్నిస్తోంది..ఇదెంతగా విస్తరించిందంటే పొలిటికల్ లీడర్లపై కూడా బ్యాడ్ చేసేందుకు కరోనావైరస్ ని ఎడా పెడా వాడేస్తున్నారు

ఉదయాన్నే ఓ ఛానల్ ( ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోంది)లో బిజెపి లీడర్ మాట్లాడుతూ..మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్లు..వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి వైఎస్ ప్యామిలీ వైఖరి,,బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుతూ...ఆ ఫ్యామిలీ పెద్ద కరోనావైరస్ అంటూ నోరు పారేసుకున్నారు..దానికి తగ్గట్లే అక్కడున్న వైఎస్సార్సీపీ లీడర్ రవిచంద్రరెడ్డి కూడా సరైన పౌరుషపదజాలంతోనే రిటార్ట్ ఇచ్చారు..

ఇది ఏపీ కరోనా సంగతైతే..
సాయంత్రమయ్యేసరికి..ప్రశాంత్ కిషోర్ అనబడు పీకేపై జనతాదళ్ యూ లీడర్ విరుచుకుపడ్డారు..పీకే ఓ కరోనావైరస్ లాంటోడంటూ కితాబులాంటి విమర్శ చేసాడు..

ఇంతకీ ఈ ఏపీ కరోనా..బీహార్ కరోనా వాడకమనేది..ఏ అర్ధంలో వాడారు...వేగంగా విస్తరిస్తారనే అర్ధంలోనా..లేకపోతే..అందరినీ చంపేస్తారనే అర్ధంలోనా..ఎలాగైనా..ఇలా జబ్బులతో  లీడర్లని పోల్చడమనేది ఇప్పుడు రాజకీయనేతలు అందిపుచ్చుకున్న ట్రెండ్ అనుకోవాలి

Comments