జగన్ కేసులలో జగద్విఖ్యాత అరి వీర భయంకర నేర పరిశోధకుడిగా తెగ పాపులర్ అయిపోయిన వి లక్ష్మీనారాయణగారు జనసేన నుంచి జంపయ్యారు..వాస్తవానికి ఆయన పవన్ వెంట కంటే..విడిగానే ఎక్కువ కన్పించారు..అందులోనూ మొదట్నుంచి పవన్ కల్యాణ్ తో నడిచిన వ్యక్తేమీ కాదు..కానీ జనసేనలో కాస్త విషయం ఉన్నవాళ్లలో నాదెండ్ల మనోహర్, లక్ష్మీనారాయణలే ప్రథమ వరసలో ఉంటారు..
ఐతే జనసేనలోకి వెళ్లకముందే...లక్ష్మీనారాయణగారు బిజెపితో చేరితే ఎలా ఉంటుందనే విషయం ఒకరిద్దరిని అడిగారు..(రూఢిగా తెలుసు)..కానీ అప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుతుందా...అన్పిస్తోంది..ఎందుకంటే..సిఏఏ పై ఆయన స్వరం అచ్చంగా బిజెపి కేంద్రమంత్రుల టోన్ లోనే విన్పిస్తోంది...మన దేశమేం ధర్మశాల కాదు..ధర్మసత్రం కాదు..అందరికీ ఆశ్రయం కల్పించడానికి..అంటూ కామెంట్ చేశారాయన..
ఇలా కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది..ఆయన అభిప్రాయం ఎటూ యూట్యూబుల్లో బాగానే చక్కర్లు కొడుతున్న సమయంలో మళ్లీ ఓపెన్గా మాట్లాడటం..కేవలం బిజెపి నుంచి ఆహ్వానం అందుకోవడానికేనా...మరి అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ కూడా...పార్టీకి చీఫ్ గా కన్నా లక్ష్మీనారాయణ అయినా...జేడీ లక్ష్మీనారాయణ అయినా..మోదీ లీడర్ షిప్లోనే పని చేస్తామంటూ ప్రకటన చేశారు..అప్పట్లో ఇంకా బిజెపి చీఫ్ అవలేదాయన...
మరి ఇన్ని సంకేతాలకు...చివరి మలుపు కమలంతో ప్రయాణమేనా..లక్ష్మీనారాయణగారూ..
Comments
Post a Comment