ఏపీ గవర్నమెంట్ బిసి స్కీమ్స్ పై అంధజోత ఏడుపు...ఇదే కేసీఆర్ అయితే


దుమ్ము రేపే దమ్మున్న ఛానల్..కావాల్సినంత దుమ్మూ ధూళీ పోగు చేస్తుందనడంలో సందేహమే లేదు..ఆ మాటకి వస్తే ప్రతి ఛానల్ అదే చేస్తుందని ఓ రెండు గంటలు వాటిని చూస్తే చాలు..అర్ధమైపోతుంది..మనకి అలవాటైన పనేగా అనుకుంటూ రోజూ వేసే బురదలో ముందు వాళ్లెంత కూరుకుపోతుందీ ఈ స్కందావారాలకు తెలియడం లేదు..ఏ స్కీమైనా మేనిఫెస్టోలో పెట్టడం వీలైతే ఆ తర్వాత వాటిని మర్చిపోవడమే జరుగుతున్న రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఒక్కో స్కీమ్ అమలు చేస్తున్నారు..

అయినా ఆ స్కీమ్ లోటుపాట్లను ఎంచడం మానేసి బిసిల్లో..ఎస్సీల్లో వాళ్లకి వాళ్లే తగవులు పెట్టుకునేలా హెడ్డింగులు వార్తలు రాస్తూ అసహనం పుట్టే ప్లానేసిన ఛానళ్లు ఎంత ఘోరంగా వ్యవహరిస్తుంద ీపై ఫోటోలు చూస్తే అర్ధమైపోతుంది..రజకులు..నాయీ బ్రాహ్మణులు..టైలర్లకి మాత్రమే సాయం అని పెట్టడంలో ఉద్దేశం గమనించండి..బిసి కులవృత్తులవారికి ఎవరికైనా పదివేల సాయం అని అమలు చేస్తున్న సమయంలో ఇలాంటి వార్తలతో ఒక్క  ఓటైనా టిడిపికి పడుతుందా.

పైగా అమ్మఒడికి బిసి సంక్షేమపథకాల నుంచి సాయం అంటూ మరో లైన్..అమ్మఒడి అందరికీ వర్తించే స్కీమ్ అందులో బిసిలు ఉంటారు..ఎస్సీలు ఉంటారు..ఎస్టీలు ఉంటారు..అలాంటప్పుడు నిధుల మళ్లింపు వార్తలతో ఏంటి ఒరిగేది..పైగా దీనికి నిర్దారణ లేదు..ఊరికే అట అట అంటూ అట్లు పోసుకోవడం తప్ప..

Comments