వయ్యా ఎస్ బ్యాంక‌్‌తోనూ బాబు బంధమా..ఏంటీ ఆరోపణలు రెడ్డిగారూ


కౌంటర్లు...ఎన్ కౌంటర్లు..రెండింటిలో పస ఉంది..రెండూ అర్ధసత్యాలే..ఏది నిజం ఏది అబద్దం వాళ్లకే తెలియాలి
యెస్ బ్యాంక్‌లో టిడిపి హయాంలోనే టిటిడి నిధులు భారీగా డిపాజిట్ చేసారని..అది మునిగిపోతుందని తెలిసే సుబ్బారెడ్డి గారు 1300కోట్లు విత్ డ్రా చేసారని అంటున్నారు..ఏ కారణంతోనైతేనేం వెంకన్న సొమ్ము గట్టిదే అనుకోవాలి..ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డిగారికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఐతే విజయసాయిరెడ్డిగారు ఇదే సందర్భంలో బాబుగారి బంధంతోనే ఎస్ బ్యాంక్ లో సొమ్ములు వేసారని ఆరోపణలు గుప్పిస్తున్నారు..ఇందులో నిజమెంతో తెలీదు కానీ..ఇలా ప్రతి అంశంలో ఆరోపణలు చేయడం సబబు కాదు..నెటిజన్స్ ట్విట్టర్స్ కూడా ఇదే మాటా ఆయన్ని అడుగుతున్నారు..ఆరోపణలేల..రుజువులుంటే నిరూపించాలని..వాస్తవానికి ఈ క్విడ్ ప్రోకోలలో రుజువులు ఎలా దొరుకుతాయ్..?

ఐతే ఎస్ బ్యాంక్ రాణాకపూర్ గాడికి ఇలాంటి కమిషన్లు పుచ్చుకునే అలవాటు మాత్రమే కాదు..ఏకంగా డబ్బు దారి మళ్లించిన చరిత్ర కూడా ఉంది.అందుకే ఈ ఆరోపణలకు కాస్తైనా ప్రాధాన్యత ఏర్పడింది

Comments