చిల్లర రాజకీయాలు చేస్తే జనం తిరగబడతారు...
చెప్పడానికి బాసు ..నంబర్ వన్..కానీ ఎప్పుడు చెప్పాలి..ఎవరికి చెప్పాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా..? ప్రశ్నించేవాళ్లపై బురదజల్లుతున్నారంటూ వాపోతున్న పవన్ కల్యాణ్ ఎవరు బురద జల్లారు..ఎవరు సమాధానం చెప్పారనే తెలివిడి లేకపోతే ఎలా...లేదంటే పొత్తు పార్టీని పిచ్చపిచ్చగా తిడుతుంటే..ఏం గురూ ఇది గమ్మునుండి పోతావని పై నుంచి అక్షింతలు ఏవైనా పడ్డాయా...?
కిట్లపై ముందు యాగీ చేద్దామనుకుంది ఎవరు..?
కాణిపాకంలోప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరింది ఎవరు..?
తీరా ఆరోపించినవారి పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లోనే కిట్ల రేటు ఎక్కువని తెలిస్తే..దానికెందుకు ఉలుకూ పలుకూ లేదు.
పైగా ఎప్పుడు ప్రారంభమవుతందో తెలీని పార్లమెంట్లో అడుక్కోమంటూ పారిపోతుంది ఎవరు..?
తీరిగ్గా ఒడ్డున కూర్చుని ఇంతింత బంకమట్టి రెండు చేతులతో పట్టుకుని ఎదుటివారిపై విసిరేసి..కడుక్కోండంటూ సవాళ్లు విసురుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా ఎవరైనా...?
ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక...జనం చిల్లర రాజకీయాలను సహించరు..తిరగబడతారు..విధి విధానాలు..అంటూ సోది కబుర్లు చెప్తున్న పవన్ కల్యాణ్..ముందు పై ప్రశ్నలకు సమాధానం చెప్పి..అప్పుడు నువ్ నీ బొచ్చుని సవరించుకుంటూ (తలపైనా..గడ్డంకింద) ప్రశ్నించు..ఎవరు ఎవరిపై తిరగబడతారో..
దేశంలోనే ఫస్ట్ టైమ్ సౌత్ కొరియా నుంచి....(ఏహ సరిగ్గా విను చైనా కాదు..సౌత్ కౌరియా) నుంచి కిట్లు తీసుకవచ్చి టెస్టింగ్ చేసి శభాష్ అని కేంద్రంచేత కూడా అన్పించుకున్న రాష్ట్రంపై అవాకులు చెవాకులు పేలుతున్నారే మీకు తెలంగాణలో అసలు సెకండరీ కాంటాక్ట్లకు టెస్టింగే ఎత్తేసిన సంగతి తెలీదా..ఏం మరి నోరు పెగలదేం...?
ఆంధ్ర లో ఇంత వెకిలి చేసే చిల్లర జీవులు మరి తెలంగాణాలో నోరు తెరవరు. అక్కడ ఈ వెకిలి వేషాలు వేస్తే బుచికోయమ్మ బుచికి అవుతుందని తెలుసు.
ReplyDelete