రంగంలో చెప్పిందే మోడీ చేయిస్తున్నాడా..ఏమో ఎవరి నమ్మకం వారిది



నమ్మకాలు..సైన్స్  దేనికదే బలమైన ప్రభావం చూపే దేశం మనది..నేను చేసే పనిలో ఏ నమ్మకం లేదు..సైన్స్ లేదు.మన ఐక్యతకి చిహ్నంగానే దీపాలు వెలిగిద్దాం అని మోదీ చెప్పినా సరే ఎవరూ వినదలుచుకోలేదు..ఎవరికి వారు తమ పాండిత్యాన్ని అన్వయించడంలో మునిగిపోయారు..అలాంటి సమయంలోనే బోనాల పండగ సమయంలో రంగంలో భవిష్యవాణి చెప్పిందంటూ ఓ క్లిప్ వైరల్ అవుతోంది చూడండి...
దీపం అజ్ఞానాన్ని చీకటిని పారదోలుతుందనడంలో సందేహం లేదు..కానీ అదే దీపం వైరస్ ని పారదోలుతుందా అంటే మాత్రం సైన్స్ వెంటనే ఒప్పుకోదు..అదే సైన్స్ ఆ దీపంలో ఫలనా నూనె వాడి..ఆ ఫలానా నూనెలో కాల్చిన ఒత్తి ద్వారా వెలువడే వాయువులు వైరస్‌ని చంపుతాయంటే మాత్రం ఓకే అంటుంది..నే చెప్పింది ఇదమిద్దంగా కరెక్ట్ కాకపోయినా...సైన్స్ నిర్ధారణ అలానే చేస్తుంది..అంతేకానీ ఇంకోటి కాదు..ఐనా దీపం ఎవరు వెలిగించినా వెలుగుతుంది..నమ్మినోడికి ఒకలాగా..నమ్మనోడికి ఒకలాగా వెలగదు..



Comments