ఇవాళ నిమ్మగడ్డ చెప్పేదేంటి..టిడిపి లీడర్లూ..కొడాలి నాని మొన్న ఓపెన్‌గానే చెప్పాసాడుగా

  ఇందులో సంచలన ప్రకటన ఏంటో..నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే మాజీ కమిషనర్ ఇచ్చే క్లారిటీ ఏంటో రెండు రోజలుుగా జరుగుతున్న పరిణామాలను గమనించినవారికి అర్ధం కావడం లేదు..ఎప్పుడో నెల క్రితం ఓ లేఖ రాశాడంటూ పెద్ద హడావుడి నడిచింది..ఆయన ప్రాణాలకు ఆపద ఉందని..అందుకే హైదరాబాద్ కి వచ్చి పని చేసుకుంటానంటూ కేంద్రహోంశాఖకి రాశాడని అప్పట్లో బాగా హడావుడి నడిచింది..ఇందులో వైసీపీ వాదన ఏమిటంటే.. అది టిడిపి ఆఫీస్ నుంచి తయారు చేయబడిందని... కాదూ అంటూ దానిపైన రమేష్ కుమారే క్లారిటీ ఇవ్వాలని అంబటి రాంబాబు సహా అందరూ ఛాలెంజులు చేశారు..సవాళ్లు విసిరారు..తొడలు గొట్టారు..ఇంత జరిగినా ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు

కానీ ఇవాళ విజయసాయిరెడ్డి డిజిపి గౌతం సవాంగ్‌ని కలవగానే..పెద్ద కదలిక వచ్చింది..నేను అది రాశాను..దీనిపై అనవసర రాద్దాంతం ఎందుకు...థర్డ్ పార్టీల ఆందోళన ఎందుకంటూ రమేష్ కుమారే బైటికి వచ్చాడు..కానీ
కొడాలి నాని రెండు రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట‌్‌లోనే ఓపెన్‌గానే ఛాలెంజ్ చేసాడు..ఆయనే నాకు ప్రాణహాని ఉందంటూ లెటర్ రాసి హైదరాబాద్ పోయిన మనిషి..ఆయనంటే మాకు భయం ఏందబ్బా...ఏం ఢ్యాషుతాడా..అంటూ  ఓపెన్‌గానే ఆ లెటర్ రాసినట్లు చెప్పాడు...ఇక ఇందులో సంచలన ప్రకటన ఏంటో..క్లారిటీ  ఏంటో ఈ ఛానల్ కి...దానిపై ఫోన్ లో తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్న లీడర్లకే తెలియాలి..

ఇంత అర్జంట్ గా ఎందుకు బైటికి వచ్చాడు రమేష్...గౌతం సవాంగ్ ఎంక్వైరీ చేస్తే..ఆ లెటర్ టిడిపి ఆఫీస్ లో తయారైందని తేలుతుందనా...లేక ఇప్పటికైనా క్లారిటీ  ఇద్దామనేనా..కానీ ఆ క్లారిటీ నాని ఇచ్చేశాడుగా...
వైఎస్సార్సీపీ ఆ లెటర్ నువ్ రాశావా..లేదా అని అడగలేదు..టిడిపి ఆఫీస్ లో ఎందుకు తయారైందీ..అని నిగ్గదీస్తుంది..దానికి కూడా క్లారిటీ ఇవ్వండి మరి


Comments