క్లోరోక్విన్‌తో పాటు మూలికలూ ఇవ్వండి..ఔనౌను..పతంజలివే ఇవ్వండి


ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కోసం నిప్పు అడిగాట్ట ఒకడు..బహుశా ఆ ఒకడు రాందేవ్ ముత్తాత వంశానికి చెందినవాడై ఉంటాడు..లోకమంతా ఏదోక మందు దొరికితే బావుండు ఎలాగోలా..బతికేయవచ్చు కరోనాకి..అనుకుంటుంటే ట్రంప్ గారేమో తన లాభం కోసమో...నిజంగా గురి కుదిరో మలేరియాకి వాడే డ్రగ్స్ పై పడ్డాడు. 

ఇదే సమయంలో  ఆరోగ్యశాఖ ఏమో...ఎహ  ఆయుర్వేదం కూడా పని చేస్తుంది..బైట అంతా కుట్ర..అసలు  బ్రిటన్ ప్రిన్స్ కి కూడా  ఆ మందులు పని చేసినయ్..కావాలనే లాబీ అడ్డుకుంటోందంటూ వాపోయారు..
ఈ సందర్భంలోనే పతంజలి గురువుగారు దయ చేశారు...పంపిస్తే పంపించారు...మూలికలు కూడా పంపండంటూ
బిల్డప్ ఇవ్వడం ప్రారంభించారు..ఇదంతా ఎందుకు...ఎహ మేం ఇప్పటికే చాలా రీసెర్చ్ చేశాం..మా వనమూలికలు కూడా కరోనాని చంపేస్తాయ్..కాబట్టి మా పతంజలి ఉత్పత్తులు వాడండి అని చెప్పడమే దాని ఉద్దేశం

పామాయిల్ ప్రొడక్ట్ లు కూడా తయారు చేస్తోన్న పతంజలి..ఆ మిషతో రుచిసోయా అనే దివాలా కంపెనీని కొనుగోలు చేసింది..దాంట్లో వంద షేర్లున్నోడికి ఒక్క షేరు మిగిల్చి మిగిలిన సొమ్ముతో ఇప్పుడు షేర్ వేల్యూ 
పెంచుకుంటూ పోతోన్న వైనంపై తొందర్లోనే సెబీ దృష్టి సారించబోతోంది..ఇంత మోసగాడా బాబా అంటూ లక్షలాది రుచిసోయా ఇన్వెస్టర్లు వాపోతున్నారు..పన్నెండేళ్ల క్రితమే ఇతగాడిపై బోలెడన్ని ఆరోపణలు పైకి యోగాగురు..చేసేదంతా మోసమంటూ గగ్గోలు..అందుకే ఇప్పుడు సందట్లో సడేమియాలాగా తన వ్యాపారం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు..

Comments