అప్పుడా ఎమ్మార్వో భర్త..ఇప్పుడు మాజీ ఎమ్మార్వో..సూసైడ్‌లు ఎలా చేసుకున్నారు..?

 అప్పడుు అంటే..ఓ ఐదారు నెలల క్రితం ఓ తెగ కోట్లకి కోట్లు నొక్కేసిందని ఓ రాణి పేరు కలిగిన ఎమ్మార్వోని అరెస్ట్ చేస్తే..నాలుగు నెలల తర్వాత ఆమె భర్త బలవన్మరణం..

ఇప్పుడు ఓ నెల రోజుల నుంచి అదే పనిగా ఏసీబీ లంచావతారం..అవినీతి అనకొండ అంటూ కోర్టుల చుట్టూ తిప్పుతున్న మరో అధికారి( మాజీ ) సూసైఢ్ చేసుకున్నాడంటూ భగ్గుమంది..ఇది నిజంగా సూసైడేనా..ఎందుకంటే యర్రంశెట్టి శాయి లాంటి పాతతరం రచయితలు..ఇతర మేధావులు కూడా సోషల్  మీడియాలో ఇలాంటి సందేహాలే పడుతున్నారు మరి..పెద్ద పెద్ద తలకాయల హస్తం ఉందని చెప్పే ప్రతి కేసులో ఇలాంటి సూసైడ్ లే జరుగుతాయేంటా అని యర్రంశెట్టి శాయి గారు బోలెడంత ఆశ్చర్యపోతున్నారు కూడా...

భారీ వర్షాలు ఈ వార్తని కప్పి పుచ్చినా..రేపో మాపో ఛానళ్లు ఇదే సందేహాన్ని పట్టుకుంటాయ్ చూడండి

Comments