అసలే ఇప్పుడు చైనా ఎవడికి ఏం బిస్కెట్ వేద్దామా...వైరస్ తప్పు తనది కాదని చెప్పుకునే ఛాన్స్ కోసం చూస్తుంటే..పొరపాటున ఈ దమ్మున్న పత్రిక గురించి కానీ తెలుసుకుందా..అదిగో ..కరోనా వైరస్ ఇండియాలోనే సంవత్సరం క్రితమే వచ్చిందట..అప్పట్నుంచి వాళ్లే ఏ ట్రీట్ మెంట్ చేయాలో తెలీక అల్లాడిపోతున్నారు..మామీద పడతారేంటి..ఇదిగో ట్రంపూ నీ బెస్ట్ ఫ్రెండ్ మోదీ నువ్వూ కలిసే మా మీదకు వదిలారు కదా..అని ఏ ఐక్యరాజ్యసమితిలోనే కంప్లైంట్ చేస్తే మా సంగతేం కావాలి..?
జిన్ పింగ్ అర్జంట్ గా ఈ దమ్మున్న పత్రికను మనకి కూడా సర్కులేట్ చేయండి...ఇదే మనకి ఆదారం..గాఠ్టిగా పోరాడదాం..అవసరమైతే అమెరికా అడిగినట్లే మనం కూడా నష్టపరిహారం డిమాండ్ చేద్దాం..వైరస్ మేడ్ ఇన్ అదర్ కంట్రీస్ నాట్ మేడ్ ఇన్ చైనా..అంటూ స్లోగన్ ఇద్దాం..ఇదిగో దానికి సాక్ష్యం 18ఏళ్లుగా ఇండియాలో దుమ్ము రేపుతున్న ఈ నంబర్ వన్ పత్రికే సాక్ష్యం అంటూ పేపర్ క్లిప్పింగ్స్ దాచి పెడితే..
Comments
Post a Comment