జగన్ రాజకీయం రాజవంశీకులను రోడ్డుపైకి లాగితే..చంద్రబాబు విజన్ ఆశోక్ గజపతిరాజుకు ఛైర్మన్ గిరీని శాశ్వతంగా దూరం చేసేలా ఉంది
అనగనగా ఓ రాజు గారు..ఆయనకి కొడుకులు..కొడుకులకు పెళ్లాలు..( తప్పు కాదు..ఒకాయనికి ఇద్దరు మరి)
ఓ కొడుకు రాజుగారు తమ సంస్థానంలోని విద్యాసంస్థలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు..ఈయనే అశోక్ గజపతి రాజుగారు ఈయన రాజకీయాల్లో నిలవడానికే( గెలుపు, ఓటమి కాదు) తన ఆస్థంతా అమ్మేసుకుంటుంటారని..మాజీ ముఖ్యమంత్రి రోశయ్యగారు ఓ సందర్భంలో చెప్పారు..మరి ఇప్పుడు రాజులు పోయారు..రాళ్లే కాదు..ఇంకేమీ మిగల్చకూడదనుకున్నారో కానీ..అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు..ఇక్కడ ఓ వారసురాలిని డంప్ చేశారు..
ఈమె పేరు సంచయిత..సరే దింపారు..తమకి అధికారం ఉంది కాబట్టి ఛైర్మన్ గా ఆమెని చేసేశారు.. దీనిపై చంద్రబాబుగారు
ట్విట్టర్ వేదికగా బాగా గెలకడం ప్రారంబించారు..కరోనా లేకపోతే చాలా చేసేవాళ్లే కానీ..ఏం చేస్తారు..పైగా పిల్లకాకి( బాబుగారి దృష్టిలో) సంచయిత ఆయనకే ఝలక్ ఇచ్చింది..మహిళా సాధికారికత గురించి లెక్చర్లివ్వడం కాదు..నేనూ వారసురాలినే..సుప్రీంకోర్టు కూడా మాకు వారసత్వపు హక్కు ప్రసాదించింది దాన్ని గుర్తించరా..అని..ఐతే ఇక్కడ
చనిపోయిన రాజుగారి మొదటి భార్య కుమార్తె సంచయిత..రెండో భార్య కుమార్తె ఊర్మిళ ఎంట్రీతో విషయం కాస్తా మీడియాకి కావాల్సినంత పండగ చేస్తోంది..ఎందుకంటే ఇద్దరూ అందగత్తెలే..చేదుగా ఉన్నా..ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం..వాళ్ల బ్యూటీనే తమ టిఆర్పీకి క్యాష్ చేసుకుంది..పైగా విషయం కూడా సరుకున్న టాపిక్కే..
Comments
Post a Comment