అబ్బ..నిమ్మగడ్డ..జగన్ ఇద్దరిలో ఎవరయ్యా జగమొండి..ఎవరికి వేయాలి వీరతాడు

 


ఎన్ని ట్విస్టులు..ఎన్ని బ్రేకింగులు..అసలెన్ని సార్లు కోర్టులకు వెళ్తారు..ఎన్ని విషయాలపై తగాదా పడతారు..

పేచీపెడతారు.. ఎన్నికల కమిషనర్కి ఎన్ని పవర్స్ ఉంటాయ్..వాటినెలా వాడుకోవచ్చనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూపిస్తుంటే..కోర్టు తీర్పులు ఇస్తున్నా డోన్ట్ కేర్ అన్నట్లుగా..ఓ ప్రభుత్వం ఎన్నిసార్లు తాము అనుకున్నది చేయడానికి సిద్ధం కావచ్చన్నది వైఎస్సార్సీపీ ఏపీలో చూపిస్తోంది.. ఇదిగో మధ్యలో మనకి వాచిపోతోంది..వాచ్ పోతోంది..(అనగా కాలం వృధా ) 


ఓ వైపు అధికారులను ట్రాన్స్ ఫర్ చేయాలన్నది ఎన్నికల కమిషన్ చేసిందంటారు..అంతులోనే కాదంటారు..ఏయ్..అలా జరగడానికి కుదరదు ఏం చేసినా నేనే చేయాలంటారు..నిమ్మగడ్డ..మరోవైపు జగన్ పంచాయితీ రాజ్ అధికారులు సిబ్బందికి ఇంక్రిమెంట్లు వేసారనే వార్త..ఏకాగ్రీవాలకు హయగ్రీవాలను పంపండనేది వైఎస్సార్సీపీ మాట..హే..మీరెవరు అది చెప్పడానికి..ఏది చెప్పినా నాకు చెప్పి చెప్పండంటాడు నిమ్మగడ్డ..మరి గతంలో ఇలా జరగలేదు కాబట్టి..అందరూ ఈ నాటకాన్ని నోరెళ్లబెట్టి చూడాల్సిందే..ఈ తంతులోనే ఉద్యోగస్తుల మాటపై ఐదో నంబర్ గడి చానల్ ముత్తు గారు రెచ్చిపోయి కొండని తవ్వి ఎలకని పట్టినట్లుగా వెంకట్రామిరెడ్డితో లైవు లు..అసలీ అందజోతి వారికి ఇంకా డబ్బం హరి..ఎందుకు గుర్తుకురాలేదో..మాయదారి మహమ్మారి కానీ సోకలేదు కదా..అంతేకాదు..కొత్తగా ఈ మధ్య రొయ్య మీసాలు పెంచుతున్న భట్రాజొకరు కూడా సైలెంట్ గా ఉండటం మరీ ఆశ్చర్యం 
ఏదేమైనా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడే పెట్టేస్తానబ్బా అంటూ నిమ్మగడ్డ గవర్నర్ ని కలవడమే హైలైటే

Comments