అయ్యా అజో అకటా ఈ ఆక్రోశం మీకు ఇన్వనందుకా..ఈనాడుకు ఇచ్చినందుకా..? యాడ్ ఆదాయంపై కావ వే..రా..అంటూ ఏడుపు
పాపం నాకు అసలు ప్రకటనలే ఇవ్వడం లేదంటూ పైన పేపర్ ఒకటే ఏడుపు..అసలు ఇంత చేసి చూస్తే..ఇది వార్తగా రాసుకోవాలి. లేదంటే తన వక్కపలుకుల్లో వేయించుకోవాలి..కానీ ఓ టిడిపి కార్యకర్త స్థాయి నేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటి..అంటే ఇది మా ఏడుపు కాదు. ఫలానా రాజకీయ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది. మాకు లేవు ఇలాంటి ఆక్రోశాలు అని చెప్పుకునే వైనంలో భాగమా?
అవును సాక్షికి ఎక్కువగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఏంటంట..ప్రభుత్వ కార్యక్రమాలను ఎవరు ఎక్కువగా హైలైట్ చేస్తే వారికి ఇస్తారు యాడ్స్..అందులో సందేహమే లేదు. హీనపక్షం ప్రజాశక్తి మాత్రం మీకు ఎందుకు ఇవ్వలేదో మీరే ఆలోచించుకోవాలి. ఓ పేపర్లో పెద్ద యాడ్ ఇచ్చి దానికిందనే అదే పేపర్లో అదే ప్రభుత్వ కార్యక్రమంపై విమర్శలు, రంధ్రాన్వేషణలు చేసే వార్తలు రాస్తే ఆ పథకాలు,స్కీములపై ఎవడికైనా ఆసక్తి ఉంటుందా..? అసలు మీరు రాసే రాతలతో ఏపీలో స్కీమ్స్ అనేవే అసలు పని చేయడం లేదు. పనికిరావడం లేదు అన్నట్లుగా ఉంటాయ్. అలాంటప్పుడు అలాంటి స్కీమ్స్ గురించిన యాడ్స్ పై మీకెందుకు దుగ్ధ..ఇది నాలాంటి ఓ సగటు అభిమాని( యాంటీ) వాదన.
పైగా వైఎస్సార్ హయాంలో కూడా మీరు కోర్టులకు వెళ్లి మరీ యాడ్స్ తెప్పించుకున్నారు కదా..ఇప్పుడూ అలానే చేయండి. పైగా కోర్టులు ఇప్పుడు న్యాయాన్ని ఏ మాత్రం కాలయాపన లేకుండా వెంటనే వెలువరిస్తున్నాయ్ కదా..
Comments
Post a Comment