హే..జగన్ కాస్కో నీ పనైపోయింది..బద్వేల్లో మా సత్తా బైటపడిందంటున్న బిజెపి...! వైఎస్సార్సీపీకి పడిన ఓట్లన్నీ దొంగలవేనా..? మరి, కాంగ్రెస్ మాటేంటి
పాఫం..మొదట్నుంచీ అనుకున్నదే అంటూ రేపర్జంట్గా ఆ రెండు పత్రికల సంపాదకీయాలు మోత మోగుతాయ్. బద్వేల్లో బిజెపిదే నైతిక విజయం అన్నా అంటారు.ఆ పార్టీ లీడర్లు..ఇలాంటి నైతిక గెలుపులే ఇక వారికి టానిక్గా అనుకుని తాగేసి పడుకుంటే పాపం పైనున్న షాలు..మోదీలు ఏం చేయగలరు?
అసలు ఈ బైపోల్ నుంచి చాలా తెలుసుకోవచ్చు కూడా ఎలాగంటారా..చూడండి కాంగ్రెస్ పొజిషన్ ఎంత బెటరైందో..ఏకంగా 4.24శాతం ఓట్లు తెచ్చుకుంది
ఇక బిజెపి హర్రే..ఇక నెక్ట్స్ సిఎం పీఠం వీళ్లదే 14.73శాతం ఓట్ బ్యాంక్.. సాధించారంటే..ఇక తిరుగేముంది రేపొద్దున్న జనసేన, టిడిపి కూడా కలిసిందంటే నా సామిరంగా 105శాతం వీళ్లవే ఓట్లు..ఇక నోటా కూడా గణనీయమైన ఓట్లనే సాధించింది 2.47శాతం ఓటర్లు..హలో మాస్టారూ..మీరెవరూ మాకు నచ్చలేదన్నారు.
మరి గెలిచిన వైఎస్సార్సీపికి ఎంతంటారా...జస్ట్ 76.25శాతం..మరి 2019లో ఓట్లెంత..95482..మరి మెజార్టీ 45వేలనుకోండి..మరిప్పుడు వచ్చిన మెజార్టీ 90వేలు..
" హే ఇదేం గెలుపబ్బా...ఇదే మేం అధికారంలో ఉంటేనా 80శాతం సాధించేవాళ్లమనేవాళ్లకి సమాధానం చెప్పలేం కదా..చివరగా పోలైన ఓట్లను చూసి కథనం ముగిద్దాం...కాంగ్రెస్ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 6217, బిజెపి కాండిడేట్ కి 21661...మరి 2024లో కేక పుట్టించడానికి రెడీనే కదా రెండు పార్టీలు...బాబూ జగన్ ఇక కాస్కో...నీ పనైపోయింది.."
" హేయ్..ఏంటా కలవరింతలు..లే.....ఎలక్షన్స్ గోల నీకెందుకు సామీ...లే...పోయి పని చూస్కే..పట్టపగలే నీ కలలూ నువ్వూ.."
Comments
Post a Comment