సెహబాస్ చంద్రబాబుగారూ..! రాజకీయాలంటే ఇలానే ఉండాలి




 ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంపై పార్టీలతో సంబంధం లేకుండా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కూడా ఈ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు..స్వయంగా వెళ్లిు ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఎంతో స్వాగతించాల్సిన విషయం



ఈ విషయాన్ని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే..ఇలాంటి పరామర్శలు..ఫంక్షన్లలో కలియడం వంటి

సంఘటనలు..ఘాటు విమర్శలకు చెక్ పెడతాయి..పరుష పదజాలం వాడకుండా నిలువరిస్తాయి.



ఆఫ్ట్రాల్ పాలిటిక్స్ విమర్శలకే కానీ..అంతా మనుషులే కదా..తప్పొప్పులు విమర్శించుకోవడంతో సరిపెట్టుకుని, కక్షలకు, దాడులకు దిగకుండా రాజకీయాలు చేస్తేనే..కింది స్తాయిలో కూడా మూక దాడులు..తగాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి..

Comments