రిజల్స్ట్ దంచి కొట్టడంతో..ఎల్ఐసి షేర్లు ఇవాళ మూడున్నరశాతంవరకూ
లాభపడ్డాయ్. ఇంట్రాడేలో 615.50రూపాయలవరకూ షేరు ధర పెరిగింది
వాల్యూమ్స్ కౌంటర్ని షేక్ చేస్తున్నాయ్..
ఇప్పటికే దాదాపు 35 లక్షల లావాదేవీలు చోటు చేసుకున్నాయ్
జనవరి-మార్చి త్రైమాసికంలో ఎల్ఐసి రూ. 13,427.8 కోట్ల స్టాండలోన్ లాభం ప్రకటించింది
ఇది సీక్వెన్షియల్గా 112శాతం, నిరుటితో పోల్చితే 466శాతం ఎక్కువ. ఐతే నికర ప్రీమియం ఆదాయం మాత్రం 8.3 శాతం తగ్గి రూ. 1.31 లక్షల కోట్లకు పరిమితమైంది. అలానే మొత్తం ప్రీమియం ఆదాయం 17.9 శాతం ఎక్కువగా వసూలు చేయగలిగింది
రూ.604.50 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా 4లక్షల కోట్ల రూపాయలకు చేరువ అయింది
Comments
Post a Comment