మార్కెట్లు వరసగా రెండో రోజు కూడా నష్టాల పాలయ్యేలా ఉన్నాయ్. ఓపెనింగ్లోనే నిఫ్టీ 50
పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం ప్లాట్గా ఉన్నా...నష్టాల్లోనే 18300 పాయింట్ల దిగువన ట్రేడవుతోంది
సెన్సెక్స్ ఫ్లాట్గా 61756 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది
బ్యాంక్ నిప్టీ ఫ్లాట్గా..ఐటీ ఇండెక్స్ అరశాతం నష్టాల్లో ఉన్నాయ్. మెటల్ సెక్టార్
మరోసారి ముప్పావుశాతం నష్టపోగా, ఎఫ్ఎంసిజి సెక్టార్ ఇవాళ లాభాల్లో ముందుండి నడిపించేలా ఉంది.
ఐతే నిఫ్టీలో ఈ స్టాక్స్ వెయిటేజ్ తక్కువ కాబట్టి..ఇంకేదైనా రంగం కలిసి రావాలి
బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐటిసి, అపోలో హాస్పటల్, నెస్లే ఇండియా ఒకటి నుంచి మూడుశాతం
వరకూ లాభపడగా, హిందాల్కో, టాటామోటర్స్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ అరశాతం నుంచి
ఒకటిన్నరశాతంవరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment