ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం మంచి దూకుడు ప్రదర్శించాయ్. ఇంట్రాడేలో ఇప్పటికే ఈ స్టాక్ రేటు 8% జంప్ చేసి
రూ.386.90కి చేరాయి. గత ముగింపు రేటు కంటే ఇది 30రూపాయలు ఎక్కువ.
కంపెనీ ఓ వైపు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్తో ఇథనాల్, బయోమాస్ వంటి
ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం..మరోవైపు మంచి ఆర్థిక ఫలితాలను
ప్రకటించడంతోనే..ఈ జోరు చోటు చేసుకుంది.
మార్చి FY23తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 88.1 కోట్ల ఏకీకృత లాభం ఆర్జించగా,
గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 53 శాతం వృద్ధి. అలానే ఆదాయం నిరుటితో పోల్చితే 21 శాతం పెరిగి రూ. 1,004 కోట్లకు చేరింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.378.85 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment