మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ ప్రెష్గా మరోసారి 18700 మార్క్ దాటింది
దీంతో ఆల్టైమ్హైకి మరో అడుగు దూరంలో నిలిచింది. ఓపెనింగ్లోనే అరశాతం వరకూ
ర్యాలీ చేసి, తర్వాత అక్కడక్కడే ట్రేడవుతోంది నిఫ్టీ !
సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 63096 పాయింట్ల వరకూ పెరిగింది.
అన్ని రంగాల షేర్లూ లాభంతోట్రేడవుతుండగా..ఎఫ్ఎంసిజి సెక్టార్ ఒకటిన్నరశాతంవరకూ ర్యాలీతో
దూసుకుపోతున్నాయ్.కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ కూడా ఇదే స్థాయిలో లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ
పావుశాతం, ఐటీ ఇండెక్స్ అరశాతానికిపైగా లాభపడింది. హెల్త్ కేర్ స్టాక్స్ కూడా ఇవాళ లైమ్లైట్లో ఉన్నాయ్
ఈ సమయానికి ఏషియన్ పెయింట్స్,ఐటిసి,హిందుస్తాన్ యూనిలీవర్, టైటన్ కంపెనీ, నెస్లేఇండియా ఒకటిన్నర నుంచి
రెండున్నరశాతం లాభంతో టాప్ 5 గెయినర్లుగా ట్రేడవుతుండగా,కోటక్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, హెచ్సీఎల్ టెక్,అదానీ
పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పావుశాతం నంచి అరశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయ్
Comments
Post a Comment