మార్కెట్లలో అదే ఊపు..అదే లాభం కంటిన్యూ అవుతోంది. నిఫ్టీ మరోసారి 18700పైకి చేరి ట్రేడవుతోంది
సెన్సెక్స్ కూడా 63096పాయింట్లను దాటి డే హై లెవల్ని క్రాస్ చేసింది
ఇదే క్రమంలో హెల్త్ సెక్టార్ షేర్లు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయని
ఇవాళ ఆరంభంలో చెప్పుకున్నాం కదా..అందులో భాగంగానే గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ మెటోప్రొలోల్
సక్సినేట్ ట్యాబ్లెట్లకు ANDA అప్రూవల్ దక్కడంతో..ఆ కంపెనీ షేర్లు మూడున్నరశాతం లాభంతో ట్రేడ్ అయ్యాయ్
ఇంట్రాడేలో రూ. 286.45 వరకూ వెళ్లాయి
అలానే జెఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ మే నెలలో ఏడుశాతం పెరిగినట్లు
ప్రకటించింది. ఈ కంపెనీ షేర్లు ఇవాళ 2శాతానికిపైగా లాభపడి రూ.760 వరకూ వెళ్లాయి
Comments
Post a Comment