మార్కెట్లు లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ 19400 పాయింట్లపైన ట్రేడవుతోంది
సెన్సెక్స్ మరోసారి లైఫ్ టైమ్ హైని సవరించే పనిలో పడింది. ఈ ఇండెక్స్
ఇంట్రాడేలో 65563 పాయింట్ల వరకూ పెరిగింది. అలా 280 పాయింట్లు తొలి పావుగంటలోనే
లాభపడగా , లైఫ్ టైమ్ హై 65898 పాయింట్లు
బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభపడగా, ఐటీ ఇండెక్స్ ఒకటిన్నరశాతం నష్టపోయింది
స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఫ్లాట్గా ట్రేడవుతున్నాయ్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్
ఎఫ్ఎంసిజి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్
స్టాక్స్ పైకి లేచే పరిస్థితికన్పిస్తోంది.పిఎస్ఈ స్టాక్స్లో నష్టాలు చోటు చేసుకున్నాయ్
ఇది తొలి అరగంట తాలూకూ పిక్చర్ కాగా, రిలయన్స్, టాటామోటర్స్, హెచ్డిఎఫ్సి లైఫ్,, బజాజ్ ఆటో
జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటిన్నర నుంచి మూడున్నరశాతం లాభపడ్డాయ్. హెచ్సిఎల్ టెక్
టైటన్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం
వరకూ నష్టాల్లో ట్రేడవుతున్నాయ్
రిలయన్స్ కనుక మరింత లాభపడితే..నిఫ్టీ50 19500 పాయింట్ల మార్క్ మరోసారి
అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది
Comments
Post a Comment