ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్..అంటేనే..అటు పిల్లలకు..ఇటు పెద్దలకు మంచి
జ్ఞాపకం..వేలమంది త్యాగాల ఫలితంగా వచ్చిన స్వతంత్ర్యభారతదేశం..అప్పటి
సంఘటనలకు గుర్తుగా ఆగస్ట్ 15న ప్రతిఏటా సంబరాలు జరుపుకుంటుంటాం..అందులో భాగంగానే మణికొండ శ్లోక స్కూల్లో కూడా పాఠశాల విద్యార్ధులు, సిబ్బంది ఉత్సవాలను
ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ హానరరీ డైరక్టర్ వెంకట్ రెడ్డి..ఆనరరీ ప్రిన్సిపల్
భవాని గారు ఈవేడుకలకు హాజరుకాగా..విద్యార్ధులు వ్యాయామం, ఆట పాటలతో అలరించారు
ఈ సందర్భంగా చిన్నారులు చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది
ఈ సందర్భంగా డైరక్టర్ వెంకట్ రెడ్డి గారు భారతదేశ ఔన్నత్యాన్ని గురించి విద్యార్ధులకు వివరించారు
అనంతరం స్కూలు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టడంతో వేడుకలు ముగిశాయి
Comments
Post a Comment