స్టాక్ మార్కెట్లు వీకెండ్లో భారీ నష్టం నుంచి తప్పించుకుని ఓ మాదిరి
నష్టంతో ముగిశాయ్. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 19751 పాయింట్ల దగ్గర నిలవగా
సెన్సెక్స్ 125 పాయింట్లకిపైగా నష్టంతో 66282 పాయింట్ల దగ్గర నిలిచింది.
బ్యాంక్ నిఫ్టీ ముప్పావుశాతం వరకూ నష్టపోగా, ఐటీ ఇండెక్స్ అరశాతానికిపైగా పతనం అయింది
మిగిలిన అన్ని రంగాలు ఓ పావుశాతం అటో ఇటో మొగ్గుచూపగా, టాటా మోటర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ హెచ్సిఎల్ టెక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే రెండు నుంచి నాలుగున్నరశాతానిపైగా లాభపడ్డాయి
యాక్సిస్ బ్యాంక్,ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ,విప్రో ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం నష్టపోయాయ్
Comments
Post a Comment