స్టాక్ మార్కెట్లు కాసింత లాభంతో ప్రారంభమై, నష్టాల్లోకి జారుకున్నాయ్. నిఫ్టీ 19843 పాయింట్ల వరకూ
వెళ్లి కిందకు జారుతోంది.
సెన్సెక్స్ వందపాయింట్లు నష్టపోయింది. 66371 పాయింట్లకు జారింది. బ్యాంక్ నిప్టీ పావుశాతం లాభంతో ఉండగా, ఐటీ ఇండెక్స్
ముప్పావుశాతం వరకూ నష్టపోయింది. మెటల్ స్టాక్స్ మాత్రం ఈ రోజు భారీ ర్యాలీకి సిద్ధమైనట్లు కన్పిస్తున్నాయ్. ఇప్పటికే ఈ సెక్టార్ ఒకటిన్నరశాతం వరకూ లాభపడింది
హిందాల్కో, గ్రాసిం, బిపిసిఎల్, బజాజ్ ఆటో, జెఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటిన్నర నుంచి రెండుశాతం వరకూ లాభపడ్డాయి
టిసిఎస్, అపోలో హాస్పటల్, సిప్లా,టెక్ మహీంద్రా, నెస్లే ముప్పావు నుంచి ఒకటిన్నరశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment