మార్కెట్లు దడదడ..నిఫ్టీ @20269

 



స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో మైలు రాయిని అధిగమించాయ్. నిఫ్టీ ఇంట్రాడేలో 20269 పాయింట్లకు చేరడంతో గత రికార్డ్ అయిన 20222 పాయింట్లను 40 పాయింట్ల మార్జిన్‌తో క్రాస్  చేసినట్లైంది


ఈ జోరును మనం కేవలం జిడిపి నంబర్లకిమాత్రమే ఆపాదించాల్సిన అవసరం లేదు. కొత్త సిరీస్ ప్రారంభంలోనే నిఫ్టీ కాల్ ఆప్షన్లు భారీగా నమోదు కావడం చూస్తే..జనరల్ రన్‌లోనే ఈ మార్క్ క్రాస్ చేసినట్లు అర్థమవుతుంది. ఎటూ దేశ ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందనేది మరో సానుకూల అంశమే


47 సెషన్ల తర్వాత మొన్న నిఫ్టీ 20వేల మార్క్  సాధించగా,రెండో సెషన్‌లోనే మరో 260 పాయింట్లు పెరగడం విశేషం

Comments