స్టాక్ మార్కెట్లు కొత్తవారాన్ని స్వల్పలాభంతో ప్రారంభించి, ఫ్లాట్గా ట్రేడవుతున్నాయ్
నిఫ్టీ 19750 పాయింట్ల వరకూ పెరగగా, సెన్సెక్స్ 65844 పాయింట్ల వరకూ పెరిగి ప్రస్తుతంఓ పాతిక పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది
ఆటో స్టాక్స్ అరశాతం నష్టాలతో, కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లు ఓ పావుశాతం నష్టాలు మినహా అన్ని రంగాలు పాజిటివ్గా ట్రేడవుతుండగా, మెటల్ సెక్టార్ ముప్పావుశాతం ర్యాలీ చేసింది
హెల్త్ కేర్ అన్ని రంగాలకంటే ఎక్కువగా లాభంతో ఉండగా,ఐటీ ఇండెక్స్ కూడా అరశాతం లాభంతో ఉంది
నిఫ్టీ50లో దివీస్ ల్యాబ్స్, కోల్ఇండియా,హిందాల్కో, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా ఒకటి నుంచి నాలుగుశాతం లాభపడ్డాయి
లూజర్లుగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ట్విన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,ఏషియన్ పెయింట్స్ ముప్పావుశాతం
నుంచి రెండుశాతం నష్టాలపాలయ్యాయ్
Comments
Post a Comment