ఫాలో ఆన్ పబ్లిష్ ఇష్యూ లేదంటే క్యిప్ పద్దతిలో 7500కోట్ల మేర నిధులు సేకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెడీ అయింది. ఐతే ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అని ఎక్స్ఛేంజ్లకు తెలిపింది.
అంటే 2024 మార్చి తర్వాత ఈ ధనసమీకరణ ఉంటుంది. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్
అనుమతి ఇచ్చినట్లు తెలుపడంతో..పిఎన్బి స్టాక్ రేటు ఇవాళ 96.65 వరకూ వెళ్లింది. గత ముగింపు కంటే ఒకశాతం లాభపడి, తర్వాత అరశాతం నష్టపోయింది. నిన్న మాత్రం ఏకంగా ఏడుశాతం దంచికొట్టింది
ఈ కంపెనీ మాల్యాలు, నీరవ్ మోదీ దెబ్బకి కుదేలైంది కానీ..లేదంటే గతంలో ఈ బ్యాంక్ స్టాక్ రూ.279 దగ్గర ట్రేడ్ అయ్యేది దీనికితోడు తీసుకున్న అప్పులకు ఎక్కువ వడ్డీలు కట్టాల్సి రావడం ఈ బ్యాంక్కి ఉన్న మరో మైనస్ పాయింట్
ఐతే ఇప్పుడిప్పుడే తనకి కవరేజ్ ఇచ్చిన బ్రోకరేజ్ కంపెనీలు స్టాక్ రేటుని అప్గ్రేడ్ చేయడం గమనించాలి
Comments
Post a Comment