వేదాంతకి ఉన్న అప్పుల గురించి అందరికీ తెలుసు..కంపెనీ రీస్ట్రక్చర్ చేసి
వీటి నుంచి ఉపశమనం పొందుతామంటూ మొన్నామధ్య మంచి ప్లాన్ ఒకటి అనవైల్ చేసింది
ఐతే ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకిముందు ఈ కంపెనీ భారీగా పొలిటికల్ డొనేషన్స్
చేసింది. నవంబర్ 4న బోర్డ్ మీటింగ్లో ఈ నిర్ణయంతీసుకోగా,, దాదాపు 155 కోట్లను
ఎలక్టోరల్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాజకీయపార్టీలకు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది
ఇప్పటికి 455 కోట్లు ఈ-బాండ్లతో పార్టీలకు డొనేట్ చేసినట్లు తెలియడంతో..నష్టాలు, అప్పుల్లో ఉన్న
కంపెనీలు...ఇలా చేయడం కరెక్టేనా..అనే చర్చ ప్రారంభమైంది..ఐతే ఈ బాండ్లతో పార్టీలను సంతృప్తి
పరచితే..తమ పనులు సానుకూలంగా అవుతాయనే వాదనా మరోటి ఉంది..అలా వేదాంత ఎలక్టోరల్
బాండ్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు టాపిక్గా మారింది
Comments
Post a Comment