రియో ఒలింపిక్స్లో మనకి మెడల్ తీసుకువచ్చిన సాక్షిమాలిక్ ఇక తాను
పోటీల్లో ఉండనంటూ తన ప్రొఫెషన్కే స్వస్తి పలికారు. ఎంపి బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని
లైంగికంగా వేధించాడంటూ కొద్ది రోజుల క్రితం రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లో ఆందోళనకి దిగారు, ఈ సందర్భంగా
పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఐనా సరే బిజెపి అధిష్టానం కించిత్ కూడా స్పందించలేదు
ఇప్పుడు సదరు బ్రిజ్ భూషణ్ సింగ్కి అనునూయడైన సంజయ్ సింగే భారత రెజ్లింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా
ఎన్నికైన సందర్భంగా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ చోటుచేసుకుంది
" మేం 40 రోజులు రోడ్లపైనే నిద్రపోయాం..ఆందోళనలు చేసాం..మాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి
పరి్స్థితిలో నేను రెజ్లింగ్ కొనసాగించను " అంటూ ఆమె ఈ ప్రకటన చేసారు.
Comments
Post a Comment