మిడ్‌డే మూడ్ భేష్, రికార్డు మరోసారి బద్దలు కొట్టిన నిఫ్టీ

 




మార్కెట్లు అన్ని అడ్డంకులు దాటుకుని దూసుకుపోతున్నాయ్. నిఫ్టీ కంఫర్టబుల్‌గా గత రికార్డుని

అధిగమించిం 21603 పాయింట్ల దగ్గర నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. ఇది లాస్టియర్‌లో ఉన్నటువంటి

20600 కంటే 1600 పాయింట్లు ఎక్కువ. ప్రత్యేకించి అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ 27 వరకే ఈ స్వింగ్

చూస్తే..ఎంత భారీ ర్యాలీ ఈ మూడు నెలల్లో నడిచిందో అర్థం చేసుకోవచ్చు


సెన్సెక్స్ మాత్రం తన గరిష్టాన్ని అధిగమించలేదు..ఐతేనేం దాదాపు 500 పాయింట్లు లాభపడింది


ఈ రోజు వరకు ఆటో,మెటల్ స్టాక్సే ఇరగదీస్తుండగా, పబ్లిక్ సెక్టార్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది


అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, బజాజ్ఆటో,టాటా మోటర్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రెండు నుంచి 4శాతం లాభంతో

బ్రిటానియా, ఎన్టిపిసి, ఓఎన్‌జిసి,అదానీ ఎంటర్‌ప్రైజెస్, టెక్ మహీంద్రా అరశాతం నుంచి ఒకటింబావుశాతం నష్టంతో

ట్రేడ్ అయ్యాయ్

Comments