జొమేటో స్టాక్ గురవారం నష్టాల్లో ట్రేడవుతోంది. జీఎస్టీ డిపార్ట్మెంట్ జొమేటోకి రూ.402కోట్లు
కట్టాలంటూ నోటీస్ పంపడమే ఇందుకు కారణం. డెలివరీ ఛార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తంపై ఈ మొత్తం కట్టాలంటూ స్పష్టంగా జిఎస్టీ షోకాజ్ నోటీస్ పంపింది. ఇందులోనే పెనాల్టీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది
జొమేటో ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.120.60కి పతనమైంది. ప్రస్తుతం రూ.121.70 దగ్గర ట్రేడ్ అయింది
ఈ ఏడాదిలో జొమేటో తన డౌన్ ట్రెండ్ని రివర్స్ చేసింది.తక్కువ రేటు నుంచి 110శాతం పెరిగింది.
Comments
Post a Comment