సంగం ఇండియా షేర్లు ఇవాళ మంచి ఊపుగా ట్రేడవుతున్నాయ్.ఇంట్రాడేలో ఈ స్టాక్
7శాతానికిపైగా లాభపడి రూ.491రేటుకు చేరాయ్. ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటా చూస్తే..ఈ కంపెనీకి చెందిన 5.8శాతం వాటాని ఏస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా, ఆయన భార్య మాధురీ మధుసూదన్ కేలాకి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2.94 మిలియన్ ఈక్విటీ షేర్లకు సమానం
జనవరి 8నే ఈ టెక్స్టైల్స్ &అప్పారెల్ కంపెనీ స్టాక్ రూ. 488.40కి చేరింది. ఇప్పుడు పక్షం రోజుల్లోనే ఆ రేటుని అధిగమించింది. గత రెండు నెలల్లో ఈ స్టాక్ 54 శాతం పెరిగింది.
ఈ కౌంటర్లో ఈరోజు ఉదయం 11:59 గంటల సమయానికే మొత్తం ఈక్విటీలో 4.8 శాతానికి సమానమైన 2.42 మిలియన్ ఈక్విటీ షేర్లతో భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ రికార్డ్ చేయడం విశేషం
Comments
Post a Comment