స్టాక్ మార్కెట్లు బడ్జెట్కి ఓ రోజు ముందు ఊపుగా ట్రేడవుతున్నాయ్.
నిన్న ఉస్సూరనిపించిన నిఫ్టీ ఈ రోజు 125 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 71500 దాటేసింది
బ్యాంక్ నిఫ్టీ 2శాతానికిపైగా ర్యాలీ చేయగా, ఐటి ఇండెక్స్ పావుశాతం పాజిటివ్గా ట్రేడవుతోంది
ఐతే కేపిటల్ గూడ్స్ రెండున్నరశాతం నష్టపోయింది. హెల్త్కేర్ రంగం ఒకటిన్నరశాతం లాభపడింది.బహుశా ఇక ఈ ఇంటెరిమ్ బడ్జెట్లో పెద్దగా వచ్చేదేం లేదని..పిఎస్ఈ, కేపిటల్ గూడ్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారేమో తెలీదు కానీ..ఈ రెండు రంగాలు ఇవాళ స్లోగా ఉన్నాయ్
HDFC బ్యాంక్, టాటా మోటర్స్, హెచ్సీఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ యాక్టివ్గా ట్రేడవుతున్నాయ్.
Comments
Post a Comment