స్టాక్ మార్కెట్లు ఇవాళ కేక పుట్టింాయ్. సెన్సెక్స్ కొత్త గరిష్టాన్ని
72720 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 21928 పాయింట్ల దగ్గ సృష్టించగా..
ఆల్మోస్ట్ ఆ పాయింట్ల దగ్గరే ముగిశాయ్ కూడా..! నిఫ్టీ 21894 పాయింట్ల దగ్గర 247
పాయింట్ల లాభంతో..సెన్సెక్స్ 847 పాయింట్ల లాభంతో 72568 పాయింట్ల దగ్గర నిలిచాయ్
ఈ రోజు మార్కెట్లలో ఐటీస్టాక్స్ అదరహా అనిపించగా, ఆయిల్ అండ్ గ్యాస్
పిఎస్ఈ స్టాక్స్ కూడా ఓ మాదిరి లాభంతో సై అనిపించాయ్..మార్కెట్ల జోరుకు
టెక్,ఐటీ స్టాక్స్ గర్జనే కారణం. ఈ రెండు సెక్టార్లూ దాదాపు 6శాతం లాభంతో ముగిశాయ్
ఇన్ఫోసిస్,ఓఎన్జిసి, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ ,టిసిఎస్ 4-8శాతం దంచి కొట్టగా..
సిప్లా,అపోలో,అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి నుంచి ఒకటింబావుశాతం
వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment