జీ పగిలిపోయింది...రెండేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు నిజమైంది..సోనీ క్యాన్సిల్స్ జీ డీల్

 




జీ-సోనీ మెర్జర్ ఇక దాదాపు పూర్తి కానట్టే..ఇప్పటికే సోనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకి

ఈ మేరకు సమాచారం కూడా పంపిందంటున్నారు. ఈ డీల్ ఎప్పుడైతే 2021లో ప్రకటించారో..అప్పుడే 

మనం అసలు సుభాష్ చంద్ర..అతని కొడుకు ఇద్దరూ సంస్థలో మేజర్ రోల్ తీసుకోవడంపై

అమెరికన్ ఇన్వెస్కో గ్రూప్ ఆగ్రహంతో ఉందని రిపోర్ట్ చేశాం.అంతేకాదు..అసలీ డీల్ పూర్తి కాదని

కూడా అప్పట్లోనే చెప్పాం..ఇప్పుడు ఆ అంచనా నిజమైంది. 


విలీనంతో ఏర్పడే కొత్త సంస్థని గోయెంకా లీడ్ చేయడం కుదరదు అని సోనీ కూడా తెగేసి చెప్పడంతో పాటు

డీల్ క్యాన్సిల్ అనే సమాచారం కూడా జనవరి 8నే పంపిందని మార్కెట్లో టాక్ నడుస్తోంది. దీనిపై అఫిషియల్‌గా

సమాచారం రానాల్సి ఉంది


సోనీ సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలీనంతో 10 బిలియన్ డాలర్ల కంపెనీ ఏర్పాటు కావడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్

సంస్థలకు ధీటుగా మారేది.ఐతే ఆధిపత్యధోరణులు..అక్రమాల వీరులకు పగ్గాలు అప్పగించడంపైనే ఈ డీల్ క్యాన్సిల్ అవుతున్నట్లు

అర్థమవుతోంది. మరోవైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు..ఈ గ్రూప్ సంస్థల స్టాక్స్‌పై ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నవాళ్లకి

ఇదో పెద్ద షాక్









Comments