వరసగా రేటు పెంచుకుంటూ పోవడమ తప్ప..ఏ కొద్దిగా అయినా తగ్గించని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటర్స్ ఓ చిన్నపాటి సంచలనం కలిగిస్తోంది. తన క్రేజీ మోడల్స్ టియాగో, నెక్సాన్ రేట్లను లక్షా20వేల రూపాయలు తగ్గించింది. ఐతే ఇవి రెండూ ఎలక్ట్రిక్ కార్లు కావడంతో..బ్యాటరీల రేట్లు తగ్గాయి కాబట్టి తానూ ఇలా తగ్గించిందని చెప్తున్నారు..ఎలాగైనా ఈ తగ్గించిన మొత్తం తక్కువ మొత్తం కాదు కాబట్టి ఇది ఆటోమొబైల్, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మరింత పోటీకి దారి తీయవచ్చు
తగ్గించిన రేట్ల తర్వాత టాటానెక్సాన్ 14.49లక్షలకు..టియాగో రూ.7.99లక్షలకు విక్రయించనుంది.
రీసెంట్గా లాంఛ్ చేసిన పంచ్ మోడల్ మాత్రం రేట్లలో ఎలాంటి మార్పులేకుండా సేలవుతాయని కంపెనీ ప్రకటించింది
టాటా మోటర్స్ షేరు గత వారంలో మాంచి ఊపుగా రూ.950రేటుకు వెళ్లిన తర్వాత ఈ వారంలో కాస్త స్లో అయింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి 1శాతం నష్టంతో రూ.904 దగ్గర ట్రేడ్ అయింది
Comments
Post a Comment