తమిళనాడులో కొన్ని సంవత్సరాల క్రితం మూసేసిన కాపర్ స్మెల్టర్ ప్లాంట్
రీఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వేదాంత కోర్టులో పిటీషన్ వేసింది
ఐతే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు ఈ సందర్భంగా కోర్టు చేసిన
కామెంట్లు కూడా ఆసక్తికరంగా మారాయ్
" ఈ సంస్థ కార్యకలాపాల తీరుపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయ్. స్థానికుల సుస్థిర
ఆరోగ్యసంరక్షణ, అభివృద్ధి మా దృష్టిలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రదేశంలో సంస్థ
చేసే అభివృద్ధి గురించి మాకు తెలిసినా..అత్యున్నత లక్ష్యం దృష్ట్యా వాటికి అనుమతి ఇవ్వబోము"
అంటూ సుప్రీంకోర్టు స్టెరిలైట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేసేందుకు అనుమతిని నిరాకరించింది
ఈ నిర్ణయం వేదాంతకి ఓ షాక్గా చెప్పాలి.
Comments
Post a Comment