భారీలాభంతో మార్చ్ బిగిన్స్
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ ఇంట్రాడేలో
22179 పాయింట్ల వరకూ పెరిగింది. సెన్సెక్స్ 630 పాయింట్లు లాభపడింది
బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం వరకూ లాభపడగా,ఐటీ ఇండెక్స్ ఫ్లాట్గా
ట్రేడవుతోంది. హెల్త్కేర్ షేర్లు మినహా అన్ని రంగాలూలాభాల్లోనే సాగుతున్నాయ్
మెటల్స్,ఆయిల్ అండ్ గ్యాస్,పిఎస్ఈ షేర్లు 2శాతం వరకూ ర్యాలీ చేసి మార్కెట్లను
ముందుకు నడిపిస్తున్నాయ్.
బిపిసిఎల్, ఓఎన్జిసి,టాటాస్టీల్, ఎల్ అఁడ్ టి, జెఎస్డబ్ల్యూ స్టీల్ రెండున్నర నుంచి4శాతంవరకూలాభపడ్డాయి
అపోలో హాస్పటల్, సన్ఫార్మా,ఇన్ఫోసిస్,సిప్లా,ఎల్టీఐ మైండ్ట్రీ అరశాతం నుంచి ముప్పాతికశాతం
వరకూ నష్టపోయాయ్. ఇదంతా కూడా మార్కెట్ ఓపెనైన తొలి అరగంట తాలూకూ పిక్చర్
Comments
Post a Comment