అపీజే సురేంద్ర ఐపిఓకి ఓ మాదిరి లాభం..!

 అపీజే సురేంద్ర పార్క్ ఐపిఓ కాసేపటి క్రితం ఓ మాదిరి ప్రీమియంతో

లిస్ట్ అయింది. ఈ స్టాక్ అలాట్‌మెంట్ రేటు రూ.155కాగా, 187తో ట్రేడ్ ప్రారంభించింది

ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.192.65 వరకూ వెళ్లింది



రూ.930కోట్ల ఇష్యూ అయిన ఈ హోటల్ హాస్పిటాలిటీ ఐపిఓ , ఇష్యూకి వచ్చిన సమయంలో

మంచి ఆదరణే దక్కించుకుంది. ఓవరాల్ కేటగరీల్లో 60రెట్లు స్పందన దక్కించుకుంది. ఐనా

లిస్టింగ్ రోజున మాత్రం 15శాతం మాత్రమే లాభం పంచగలిగింది


పార్క్ బ్రాండ్ కింద హోటల్ చెయిన్ నడుపుతోన్న ఈ కోల్‌కతా బేస్డ్ సంస్థ రిటైల్ ఫుడ్, బెవరేజెస్ 

వ్యాపారంలోనూ ఉంది. ఫ్లరీస్ బ్రాండ్ కింద వాటిని విక్రయిస్తోంది. సెప్టెంబర్ 2023 లెక్కల ప్రకారం

కంపెనీకి రూ.22.95కోట్లలాభం వచ్చింది. రెవెన్యూ రూ.272 కోట్లకి పైబడి ఆర్జించగా, 

స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.191.40 దగ్గర ట్రేడ్ అయింది


Comments