ఆర్థికఅవకతవకలకు పాల్పడిన జేఎం ఫైనాన్షియల్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటుండగా
ట్రేడర్లు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. దీంతో స్టాక్ వరసగా మరో సెషన్ కూడా పదిశాతం
పతనం అయింది. ఇంట్రాడేలో ఈ రోజు ఈ స్టాక్ రేటు రూ.79.20కి జారిపడింది
ఐపిఓ సబ్స్క్రిప్షన్లు, షేర్లను తాకట్టు పెట్టుకుని లోన్లు వగైరా కార్యక్రమాల్లో అనైతిక
కార్యకలాపాలు చేసినట్లు JM ఫైనాన్షియల్ లిమిటెడ్పై సెబీ కొరడా ఝళింపించింది. అంతేకాదు
తాజాగా పబ్లిక్ ఇష్యూలకి లీడ్ మేనేజర్గా వ్యవహరించకుండా నిషేధించింది. ఈ పరిణామాలు
స్టాక్ రేటుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయ్. అందుకే వరసగా రెండో సెషన్ కూడా ఈ స్టాక్
చతికిలబడింది
Comments
Post a Comment