మార్కెట్లు వీకెండ్లో తిరిగి నష్టాల్లో ట్రేడవుతున్నాయ్.నిఫ్టీ 22వేల పాయింట్ల మార్క్
కోల్పోయింది.21956 పాయింట్ల వరకూ దిగి..ప్రస్తుతం 21996 పాయింట్ల దగ్గర
ట్రేడవుతోంది
సెన్సెక్స్ ఇంట్రాడేలో 72998 పాయింట్ల వరకూ మాత్రమే పెరిగింది. ఇది గత
ముగింపు కంటే వందపాయింట్లు తక్కువ. ఆ తర్వాత 72549 పాయింట్ల వరకూ
పతనం అయింది. ప్రస్తుతం 470 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది
బ్యాంక్ నిఫ్టీ అరశాతం కంటే ఎక్కువగా, ఐటి ఇండెక్స్ ఒకశాతం నష్టపోయాయ్
ఎఫ్ఎఁసిజి ఒక్కటే ఫ్లాట్గా ట్రేడవుతుండగా, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ సెక్టార్లు
బ్లీడవుతున్నాయ్
బజాజ్ ఫైనాన్స్, యుపిఎల్,ఐటిసి, బ్రిటానియా, భారతి ఎయిర్ టెల్ ముప్పావు నుంచి రెండుంబావు
శాతం లాభపడగా, బిపిసిఎల్, కోల్ఇండియా, ఎన్టిపిసి, ఓఎన్జిసి, మహీంద్రా అండ్ మహీంద్రా మూడు నుంచి
ఆరుశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment