చెప్పినట్లుగానే దంచేసిన మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు ఉదయం మనం వేసిన అంచనాకి తగినట్లుగానే అప్ బీట్ వేస్తున్నాయ్

నిఫ్టీ ఇంట్రాడేలో బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ తీసుకుంది. 234 పాయింట్లకిపైగా లాభపడింది

ఎకాఎకిన 22వేల పాయింట్లను దాటేసి సాలిడ్‌గా ట్రేడవుతోంది. మరో గంటలో మరో 100 పాయింట్లు

లాభపడినా ఆశ్చర్యం లేదు



సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 72882 పాయింట్లకు జంప్ చేసింది


బ్యాంక్ నిఫ్టీ ఒకటిన్నరశాతం వరకూ ర్యాలీ చేసింది. ఐటి ఇండెక్స్ ఒకశాతం

లాభంతో ట్రేడవుతోంది.అన్ని రంగాల్లో ఉత్సాహం కన్పిస్తుండగా గత నాలుగు సెషన్లుగా

చితికిపోయిన PSE ఇండెక్స్ 3శాతం ర్యాలీ చేసింది


దీంతో టాప్ గెయినర్లుగా ఎన్టీపిసి,బిపిసిఎల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో

మూడునుంచి నాలుగు శాతం వరకూ దంచికొట్టాయ్. లూజర్లుగా నెస్లే,హీరోమోటోకార్ప్

నామమాత్రం పావుశాతం వరకూ నష్టపోయాయ్

Comments