ప్లాస్టింగ్ మౌల్డ్స్, పైప్స్ కంపెనీ ప్లాటినమ్ ఇండస్ట్రీస్ ఐపిఓ ఈ రోజు మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది
ఐపిఓ అలాట్మెంట్ రేటుతో పోల్చితే 35శాతం ప్రీమియంతో ట్రేడ్ ప్రారంభించి డీసెంట్ గెయిన్స్ పంచింది.
రూ.171 ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపిఓ అలాట్మెంట్ రేటు కాగా..రూ.225 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించుకుంది.తదుపరి రూ.236.25 ధర కూడా పలికింది
రూ.235 కోట్లకి పైచిలుకు ధనాన్ని ఐపిఓ ద్వారా సేకరించిన ఈ ఐపిఓకి ఇష్యూటైమ్లో ఓవరాల్గా 99 రెట్లు బిడ్లు ఎక్కువగా వచ్చాయ్. రిటైల్ కేటగరీలో 50.99రెట్లు సబ్స్రిప్షన్లు రాగా..ఆ మాదిరిగానే లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయ్
లూబ్రికెంట్స్, సిపివిసి అడిటివ్స్, పివిసి స్టెబిలైజర్స్ తయారీలో ఈ ప్లాటినమ్ ఇండస్ట్రీస్ వ్యాపారం చేస్తుంటుంది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి ప్లాటినం ఇండస్ట్రీస్ షేర్లు రూ.222.35 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment