ఎప్పట్నుంచి రగులుతుందో తెలీదుకానీ...అక్కినేని నాగేశ్వర్రావ్ కూతురు నాగసుశీల..చింతలపూడి శ్రీనివాసరావ్ పై కేసులు పెట్టేసింది. అతగాడేమో నాకేం తెలీదు అంతా చట్టప్రకారమే జరుగుతుందంటాడు..అసలు సీన్ ఇక్కడ కట్ చేసి కాస్త వెనక్కి వెళ్తే..
కరెంట్,అడ్డా,కాళిదాసు..ఇలా ఓ అరడజను సినిమాలను అక్కినేని బ్రాండ్ నేమ్తో జనం మీదకి శ్రీనాగ్ కార్పొరేషన్ పేరుతో వదిలారు. అందులో హీరో సుశాంత్. ఈయన నాగసుశీల కుమారుడు..నాగార్జునకి మేనల్లుడు..ఐతే వీటిన్నిింటికీ చింతలపూడి శ్రీనివాసరావే నిర్మాత..నిర్మాత అన్నమాట..ఫంక్షన్లలో నాగసుశీల వెనుకే కన్పించేవాడు..ఐతే ఇప్పుడు సడన్గా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడానికి కారణం..నాగసుశీల ఇంకా ఇంకా సుశాంత్ ని హీరోగా ప్రమోట్ చేయడానికి ఒత్తిడి చేయడమే అని సిహెచ్ శ్రీరావ్ అంటున్నాడు.
ఆటాడుకుందాం..రా..ఇదీ చివరిగా సుసాంత్తో తీసిని సినిమా..ఇక ఇక్కడితో ఆపేద్దాం అని శ్రీనివాసరావ్ అన్నాడట..ఐతే ఆమె ఊరుకోలేదటు..ఇది ఈయన కథనం..అసలు తానెవరికీ బినామీ కాదని..నా సంస్థలో వాళ్లు వచ్చి చేరారని..తనకేదైనా ఆయితే నాగార్జునదే బాధ్యత అని ఫోన్ ఇన్లు ఇస్తున్నాడు..ఇక నాగసుశీల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. మా ఆస్థుల్లో మాకు తెలీకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి అమ్మేశాడు. సంస్థలో భాగస్వామి అయి ఉండి ఇలా చేయడమేంటని పంజాగుట్టలో కేసు పెట్టారు..పోలీసులు రంగంలోకి దిగితే చింతపులుసు కంగారు పడిపోయి అసలు నిజం బైటపెట్టేశాడు..అసలు ఎప్పుడో అమ్మేసిన ఆస్తులకు ఇప్పుడు ఏంటి ఎంక్వైేరీలు..అంటూ నిజం నిలకడమీద తేలుతుంది..ఐతే ఈ విషయంపై ఎప్పట్నుంచో ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ విన్పిస్తోేంది. అదేంటంటే..ఓ పెద్ద ప్యామిలీకి చెందిన లేడీ..సదరు నిర్మాతను సినిమా నిర్మాణం పేరుతో..ఆర్దికంగా రోడ్డుమీదకు నెడుతోందని..ఇప్పుడదే నిజమైనట్లుగా పరిణామాలు చెప్తున్నాయ్
Comments
Post a Comment