ఇంతమంది జనమా..? జగనూ ఏం మాయ చేస్తున్నావయ్యా

నేల ఈనిందా..పుట్టపగిలిందా..ఆకాశం బద్దలైందా..అన్నట్లు ఉపమానాలు చెప్తుంటారు బహిరంగసభల్లో జనాలను చూస్తే..ఇలాంటి డైలాగులు ఎన్టీఆర్ బాగా పాపులర్ చేశారు..ఐతే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన ఓదార్పుయాత్ర..ఇప్పుడు పాదయాత్ర టైమ్‌లో వాటిని తిరిగి గుర్తు చేస్తున్నారు..మిగతా మీడియా పట్టించుకోనీ పట్టించుకోకపోనీ..తన ఛానల్‌లో మాత్రం కాస్త కవరేజీ దక్కుతుంది.ఐతే గోనెగొండ్లలో సభకి వచ్చిన జనం చూడండి ఎలా ఉన్నారో పై ఫోటోలో..ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో కాస్త చెప్తారా...?

ఇక సభల్లో కానీ..పాదయాత్రలోకానీ జగన్ మోహన్ రెడ్డి ఒకటే తారకమంత్రం..రామబాణంలా చెప్పిందే చెప్పడం మాత్రం మానడం లేదు..మన ప్రభుత్వం వస్తుంది అప్పటిదాకా ఓపికపట్టండిఅని..వెరైటీ ఉండట్లా..అంతకంటే..నిన్నగాకమొన్న పార్టీ మారిన ఎమ్మెల్యేపై ఏమైనా చెణుకులు విసురుతాడేమో అని చూశా..! కానీ అసలు ఆ ఊసే పట్టించుకోనట్లు కన్పిస్తున్నాడు..మన పాత సినిమాల్లో రమణారెడ్డిలా..అబ్బా అబ్బా ఏందబ్బా ఈ మడిసి ధైర్యం అన్పిస్తోంది..మరోవైపు ఎందుకు దారినిపోయే కంపని ఎందుకు నెత్తికి ఎత్తుకోవడం అనుకున్నాడో మరి..ఏదైనా జనం మాత్రం జగన్ వెంటే..ఓట్లుమాత్రం ఎవరివైపో అన్పించకమానదు పై ఫోటో చూస్తే..ఐతే జనం వచ్చినంతమాత్రాన ఓట్లు పడవని ఈపాటికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకి తెలిసిపోయింది కదా..మరి దానికి తగ్గ ప్లాన్ ఉందో లేదో..మరింకో వైపు చంద్రబాబు పార్టీనేమో...ఇంకా ఉన్నారు ఎమ్మెల్యేలు మావైపు అంటూ ఊరిస్తున్నారు..చూద్దాం..ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంకెంతమంది పార్టీ మారతారో..!

Comments

  1. బిర్యాని ప్యాకెట్-వందో, రెండొందలో డబ్బు-ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే రాక చస్తారా. దానికి తోడు మీలాంటి రెడ్లు ఉండనే ఉంటారు కదా. గజన్ ను చూసి మీరు మురుసుకోవలసిందే.

    ReplyDelete

Post a Comment