బలవంతంగా రాజకీయాల్లోంచి పంపేసినా..ఈ పెద్దాయన మాత్రం తెలుగువారిపై తన మక్కువ మాత్రం వదులుకోలేక నెలకోసారైనా వచ్చి పోతుండటం అందరికీ తెలిసిందే. ప్రపంచ తెలుగు మహాసభల్లోనే ఈ విషయం
స్వయంగా ఆయనే చెప్పుకున్నారు కూడా..ఉపరాష్ట్రపతిగానే కాకుండా రాజ్యసభ ఛైర్మన్గా కూడా వ్యవహరిస్తోన్న వెంకయ్యనాయుడు వేదిక ఏదైనా తన జ్ఞాపకాలు బాగా పంచుకుంటుండటం గమనించవచ్చు
ఇప్పుడు జరుగుతోన్న రాజ్యసభ సమావేశాల్లో( జనవరి 2 దాకా వాయిదా పడ్డాయ్) జనాలను మోసం చేసే యాడ్స్ పై చర్చ జరగగా స్వయంగా ఆయనే ఒబేసిటీ ప్రకటనల బారిన ఎలా పడ్డారో చెప్పుకున్న తీరు హాస్యం పుట్టించకమానదు. ఎందుకంటే బట్టతలపై జుట్టు రావడమనేది కాలం నిర్ణయించేదే కానీ ఏ మందు వాడితేనో రాదు..ఐనా దాని కోసమని డబ్బులు ఖర్చుపెట్టుకునేవాళ్లు కోకొల్లలు. అలాంటి ప్రకటననే ఒకటి చూసి
"నేనూ లావు తగ్గాలని వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ పార్సెల్ రాకపోగా..ఇంకో వెయ్యి రూపాయలు పంపిస్తే అసలు మందు పంపిస్తాంటూ సందేశం వచ్చింది" అని తన అనుభవం పంచుకున్నారు వెంకయ్యనాయుడు.
ఎక్కడిక్కడ తన పరిమితులను తప్పించి సభ్యులతో కలిసిపోతోన్న వెంకయ్యనాయుడు కొత్త పంథాని రూపొందిస్తున్నారనే చెప్పాలి.
Comments
Post a Comment