ఏపీలో ప్రభుత్వం పరువు పోగొట్టడమే ఆ 2 ఛానళ్ల లక్ష్యం రెండురోజుల క్రితం వార్త బ్రేకింగ్ న్యూసా

 ఇదిగో ఈ కింద ఉన్న రెండో వార్త చూడండి..మరణానికి మించింది లేదు..అందులో ఆత్మహత్య చేసుకుంటే అదింకా బాధాకరం..దానికి బాధ్యులను నిలదీయవచ్చు..కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటే..ఇదే ఈ రెండు ఛానళ్లు చేస్తుంది..ఈ వార్త వచ్చింది ఆంధ్రులకు వెలుగు చూపే పత్రికలో ..ఆదివారం హైదరాబాద్ ఎడిషన్ లో వచ్చింది..అంటే శనివారం వార్త...మామూలుగా టీవి ఛానళ్లలో అప్పుడు జరిగింది అప్పుడు వేయడమే బ్రేకింగ్ న్యూస్ అంటారు..
అలా ఉన్న పదహారు చానళ్లు వేస్తే..ఓ గంట గ్యాప్‌లోనే జరిగిపోతుంది..అంటే శనివారం వచ్చిన వీడియో ఆ రాత్రికల్లా పాతబడుతుంది..ఇంకా చెప్తే...ఆదివారానికి ఇదిగో ఇలా ఓ బాక్స్ కట్టి వేస్తారు..కానీ..


కానీ ప్రభుత్వంపై బురద జల్లడానికి ఏది దొరికితే అది వాడటానికి వాడకానికి పనికి రాదన్నట్లుగా రెచ్చిపోయే ఈ ఛానళ్లు సాయంత్రం 7 గంటల సమయంలో దాన్ని బ్రేకింగ్ అంటూ వేయడం చూస్తే..వాటి అసలు ఉద్దేశం తెలిసిపోవడం లేదూ...పైగా ఇది ఆ వెలుగు పంచే ఛానల్లో కాదు..పద్దతిగా పక్కాగా అద్భుతమైన నికార్సైన వార్తలు రాసినట్లు సాధ్వీమణి కబుర్లు చెప్పే మరోక చానల్..అంటే ఈరెండు చానళ్ల మధ్య అనుబంధం..వాటి ఉమ్మడి ఎజెండా తేలిపోవడం లేదూ

Comments