ఏంటీ మీకోసం జనాలే రోడ్డెక్కుతున్నారా..బాబూ ..నీ పైత్యానికి జోహోర్లు



ఎనకటికెవడో..వెంటబడి తరుముతుంటే..చూసావా నా వెనుక ఎంతమందున్నారో అన్నాడట.అలానే ఏపీలో నిషేధం ఉంది అని చెప్పుకుంటోన్న ఓ ఛానల్ తన ప్రసారాల కోసం జనమే రోడ్డెక్కుతున్నారని చెప్పుకొస్తోంది..సరే పదేళ్లు కాలం గడపడం కష్టమే..అందులోనూ పార్టీలు..పవర్లు లీడర్లు అనే ఈక్వేషన్ల మధ్య ఆదాయాలే లేని కాలంలో ఏ నేతా అండాదండా లేకుండా..ఏ బాబూ కరుణించకుండా న్యూస్ ఛానళ్లు నడపడం చాలా చాలా కష్టం

ఉజ్జోగులుకి జీతాలు ఇవ్వాలి..ఎంఎస్ఓలకు డబ్బులివ్వాలి..శాటిలైట్ ఫీజు..కరెంట్ ఖర్చులు..ఇన్ని పెట్టాలంటే ఏదో గడ్డి తినకతప్పదు..రాంగ్ రూట్్లోనో రైట్ రూట్లోనో పోవాల్సిందే..దీనికి ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు..కాబట్టే ఈ ఛానల్ కి పదేళ్ల ు నిండినందుకు అభినందనలు చెప్తాం..ఎట్ ది సేమ్ టైమ్..నిజాయితీ...దమ్ము గిమ్మూ అనే మాటలను మాత్రం ఖట్ చేయాల్సిందే..

ఎందుకంటే చానల్ మాటున బ్లాక్ మెయిల్ భాగోతాలు  బోలెడు ఉంటాయ్..ప్రతి చానల్ విషయంలోనూ..అలాంటిది జనం కోసం తిండీ తిప్పలు మానేసి..అన్నం బదులు నిజాయితీనే తింటున్నట్లు మాట్లాడితే మాత్రం వళ్లు మండుద్ది..అదేదో జెన్ అంటూ ఓ ఛానల్ వాళ్ల హేరాయిల్ యాడ్ పై పేపర్ నిండా రాసేసుకుని...టివిలో బ్లాక్ మెయిల్ స్టోరీలేసి..తీరా సదరు ఛానల్ తో డీల్ కుదరగగానే ఆపేయలేదా..అలానే ఏ నిర్మాత మనవడో..దేంతోనో కులుకుతుంటే సీక్రెట్ గావీడియో తీయించి బేరం పెట్టలేదా..స్వామీజీల మధ్య పోరుని క్యాష్ చేసుకోలేదా..
ఎందుకింత సోది బాబు భజన తప్ప ఇంకే న్యూస్ ఎందుకు గురూ...అన్న వాళ్లని బైటికి పంపలేదా

Comments