అర్రర్రే ఈ జగన్ ఎంత పని చేసాడు..కేబినెట్ బెర్తులు వద్దన్నాడా



మోదీగారు వేరా గారిని నమ్మినట్లు వేరేవెరిని నమ్మడం లేదట..అందుకే తన ఆపీస్‌లో తన గదిలో ఏం జరిగినా...కూడా వెంటనే చేరవేయండని...ఆయనకే డైరక్ట్ గా హాట్ లైన్ లో చెప్పేస్తున్నారట...పైన వ్యాసాలనబడు అచ్చొత్తిన కథనాలు చూస్తే..అదే నిజమనిపిస్తుంది కూడా....ఈ స్టోరీ అంతా రాసుకుని చివర్లో ఏం రాసుకున్నారో చూడండి..అక్కడికి జగన్ గారి వెంట కనీసం ఏ ఎంపీనీ తీసుకెళ్లలేదట..ఒక్క గోరంట్ల మాధవ్‌ని తప్పించి...అంటే గోరంట్ల మాధవే అక్కడ జరిగిందంతా ఏబీఎన్ కి చెప్పాడా...కనీసం రాజగురువిందకి కూడా తెలియకుండా బగ్గింగ్ చేయడం అంధజోచికి సాధ్యపడుతుందా...వారెవ్వా...వాటే స్టింగ్ ఆపరేషన్ గురూ...

ఏపీలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడంపై ప్రపంచదేశాల ఆందోళన
చలించిపోయిన ప్రధానమంత్రి
జగన్ పై మండిపడి..దాదాపు కొట్టినంత పని చేసిన మోదీ..
బిక్క మొహం వే్సిన జగన్...
ఇలాంటి బ్రేకింగులు చూడటానికి ఇక ఎంతో కాలం కూడా పట్టేలా లేదు..పాపం ఏం చేసినా...జగన్ మోదీ బంధం బలపడుతుందే కానీ..విడిపోవడం లేదే అనేదే మనోడి బాధ...ఎందుకంటే..హఠాత్తుగా జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లింది..రాజ్యసభ సీట్లలో వైఎస్సార్సీపీ ఎంపిలే ఎక్కువమంది వస్తున్నారు...కేబినెట్ ‌లో మీవాళ్లకి చోటు ఇస్తే ఎలా ఉంటుందన్న మోదీ డీల్ కోసం కానే కాదట.. ఉన్నట్లుండి ఎందుకు ఈ భేటీ అనే టాపిక్ రాసుకో తప్పులేదు..కావాలంటే ఎప్పుడూ వాడే ఆస్తుల కేసుల మాఫీ కోసమే వెళ్లాడని రాస్కో..ఇంకా మజాగా వేడి వేడి బఠానీలు తిన్నట్లు తిని తర్వాత..పేపర్ ని నలిపి పారేస్తారు...కానీ ఇలా...ప్రతీదీ చూసినట్లు...చేసినట్లు..రాసి మళ్లీ అట అట అంటూ అట్లెందుకు...
పైగా పైన చూడండి..జగన్ మోదీ దాదాపు రెండుగంటల సేపు మాట్లాడుకుంటే..అరగంట అని రాయడం..అంటే ఇది నిన్నటి ఫిబ్రవరి 12 సాయంత్రం వండివార్చింది..అంటే అప్పటికే మీటింగ్ అయిపోయిందని కొన్ని బ్రేకింగులు రాగానే వండేసిన స్టోరీ..తర్వాత అరర్రే..ఇఁకా లోపలే ఉన్నాడనడంతో..మళ్లీ స్టోరీ రాసారు కానీ..అప్ డేట్ చేయలేదు...

ఇంత వండిన స్టోరీలో పాపం అసలు ఆరోపణకి చివరి ప్రాధాన్యం ఇవ్వడమే అజో గారి అలవాటులో పొరపాటుకి నిదర్శనం..ముందు అక్రమాస్తుల కేసుపై మాట్లాడిన జగన్ అంటూ రాయాల్సింది తెలీకుండానే చివర్లో పెట్టడంతో పాపం పచ్చ స్టోరీలకు అలవాటైన వారికి డిజప్పాయింట్ మెంట్ మిగిలింది..ఎందుకంటే..అడగడు అన్న హోదా గురించి మోదీనే అడిగాడని తెలీకుండానే నిజం రాశాడుగా.. ఇంకా రాజధానులు..హైకోర్టు అన్నీ మోదీకే చెప్పేసాడంటే..ఇక మార్చి తర్వాత ఈ మూడు జరిగిపోతాయ్ నువ్ వస్తే రా లేకపోతే..లేదు అన్నట్లు చెప్పి వచ్చినట్లే కదా..మోదీకి సీరియస్ గా వినడం తప్ప కామెడీ చేస్తూ డ్యాన్సులు చేసే అవకాశం ఉందా అక్కడ...వచ్చే ప్రతి బిల్ పాసవ్వాలంటే రాజ్యసభ మెంబర్లు కావాలి గురూ..వాళ్లెటూ టిడిపి ఇవ్వలేదు..కాబట్టి వైఎస్సార్సీపీ చేసేదాన్ని నువ్ చెప్పినట్లు ఆగ్రహంతో కడుపు మండుతున్నా...ఆనందంగా స్వాగతించినా...సంబంధం లేని విషయమని సైలెంట్ గా చూస్తున్నా...ఏం చేయలేరు..అన్నట్లు కేబినెట్ ర్యాంకులు ఇస్తామంటే జగన్ వద్దన్నాడని ఓ సెక్షన్ ప్రచారం చేస్తుంది..దాని గురించి ఏదైనా రాసుకోవాల్సింది..జగన్ కాళ్లా వేళ్లాబడ్డా మోదీ మినిస్టరి గిరీలు  ఇవ్వను పొమ్మన్నాడని...కమాన్ గురూ..చీరప్ నెక్స్ట్   స్టోరీలో అదే పెట్టు 

Comments