నష్టపరిహారంలోనూ ఏబిఎన్‌ చెప్పినట్లే చేయాలిట..చంద్రబాబు తీరు మారాలట



చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలు చేసారుట..జగన్ గెరిల్లా దాడులట..ఏమి వర్ణన..అసలు పాలిటిక్స్‌ని యుద్ధంతో పోల్చిన సదరు ఎడిటర్ గారు..సంప్రదాయబద్ద రాజకీయాలనగానేమి అని అడిగితే..అవతలిపార్టీ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు పంచి పెట్టుటనా...పైగా అసెంబ్లీ రద్దు అయ్యేవరకూ వారిని ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగించడమా..?
పైగా ప్రమాదంలో చనిపోయినవారికి సమానంగా నష్టపరిహారం పంచడంలోనూ..రెండు రాష్ట్రాల మధ్య తేడాని గుర్తు తీసుకువస్తారట..ఇదే ఏపీవారికి..ఇంత..తెలంగాణ వారికి ఇంత అని ప్రకటిస్తే..ఏమని రాసేవాడు ఈ వ్యాసకర్త మరి..?
రాజకీయాల్లో ఎదుటి పక్షాన్ని దెబ్బ తీయకుండా..బాబూ మీరు భేష్..బ్రహ్మాండం..మీరేం చేసినా ఊరుకుంటాం అని వదిలేయాలా...?

Comments